VM Today News - భక్తి / గుంటూరు : గుంటూరు జిల్లా అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులు కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల పూజలను స్వామివారు కృపగా స్వీకరించారని అర్చకులు తెలిపారు. క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఆత్మలింగం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ ఆత్మలింగ దర్శనం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శివరాత్రి రోజున లభిస్తుంది. ఆత్మలింగాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడ్డారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆత్మలింగ దర్శనం వల్ల విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
Reporter
VMToday News