VM Today News - క్రైమ్ వార్తలు / పల్నాడు : వినుకొండలోని శివయ్య స్తూపం సమీపంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. టాయిలెట్కు వెళ్లిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. లోపలికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచి చూడగా, ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.
Reporter
VMToday News