Tuesday, 28 July 2026 03:50:24 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బాస్ సంస్ధ ను బలోపేతం చేద్దాం - పి టి ఎం శివ ప్రసాద్

Date : 25 November 2024 10:13 PM Views : 1365

VM Today News - వార్తలు / అన్నమయ్య : కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా పనిచేసి భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) సంస్థను బలోపేతం చేద్దామని ఆసంస్థ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం పీలేరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు భారతీయ అంబేడ్కర్ సేన ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శివప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే డిసెంబర్ 20 నుండి జనవరి 26 వరకూ భారతీయ అంబేడ్కర్ సేన 12వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. బాస్ సంస్థను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 1నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేలకు తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో నాయకులు చూపే చొరవను బట్టి, తదుపరి జరుగబోయే నూతన కమిటీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.ఫిబ్రవరి చివరి నాటికి సభ్యత్వ నమోదు, నూతన కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేదల సమస్యలపై ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, కావున నాయకులు - కార్యకర్తలు తమ పనులు వేగవంతం చేసి భవిష్యత్ పోరాటాలకు ప్రజల్ని సన్నద్ధం చేయాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు, ప్రజాకవి పోతబోలు రెడ్డెప్ప, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు బురుజు లక్ష్మీనారాయణ, ఆరుద్ర శ్రీనివాస్, సుధాకర్, గంగరాజు లతోపాటు బాస్ జిల్లా నాయకులు ముత్యాల మోహన్, నీరుగట్టి రమణ, ముల్లంగి కృష్ణయ్య, చాట్ల బయన్న, సొన్నికంటి రెడ్డెప్ప, బురుజు రెడ్డిప్రసాద్, సూరి రాయల్, జనార్దన్, ఇర్ఫాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: