VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఔట్సోర్సింగ్ టీజీటీ, పీఈటీ టీచర్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులను కలిసి తమ సమస్యలను వినిపించారు. 2016లో పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికై అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నామని తెలిపారు. దాదాపు పదేళ్లుగా నిజాయితీగా సేవలందిస్తున్నామని వివరించారు. తమను కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ (సీఆర్డీ)లుగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. మినిమమ్ టైమ్ స్కేలు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అర్హతలను ప్రామాణికంగా పరిగణించాలని అభ్యర్థించారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీజీటీ, పీఈటీ టీచర్లు పాల్గొన్నారు.
Reporter
VMToday News