VM Today News - వార్తలు / గుంటూరు : సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్కు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి భాగస్వామ్యంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Reporter
VMToday News