VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యులు లేరని సీపీఐ పట్టణ కార్యదర్శి ఉలవపూడి రాము మంగళవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ చికిత్స అందడం కష్టమవుతోందని పేర్కొన్నారు. ఇతర పట్టణాలకు తరలించాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఆర్థోపెడిక్ వైద్యులను నియమించాలని కలెక్టర్ను కోరారు.
Reporter
VMToday News