VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలోని పలు సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో పురుగులు పట్టిన బియ్యం విక్రయిస్తున్నారని వినియోగదారుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీల్డ్ బస్తాలు ఇంటికి తెచ్చి తెరిచితే తెల్ల పురుగులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షతో నాణ్యతలేని బియ్యం అమ్మి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఆహార భద్రతా అధికారులు ఇప్పటికైనా మేలుకొని వెంటనే తనిఖీలు చేసి చర్యలు చేపట్టి ఇలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Reporter
VMToday News